Thursday, August 1, 2024

 దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా..?

ప్రతీ సీజన్‌లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి అనారోగ్యానికి కారణమవుతాయి. చిన్న పిల్లలైనా.. పెద్దవారైనా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతుంటాయి. మెడిసిన్స్ వాడితే ఈ సమస్యలు తగ్గిపోతాయి. కానీ, పదే పదే మెడిసిన్స్ వాడటం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వర్షాకాలంలో మీరు కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇందుకోసం ఏళ్లుగా వంటింట్లో ఉపయోగించే కొన్ని వస్తువులతోనే చికిత్స పొందవచ్చు.  

వర్షాకాలంలో గొంతునొప్పి, జలుబు, దగ్గు సమస్య వేధిస్తోందా? అయితే, తులసి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్కలను నీటిలో వేసి ఆవిరి పట్టాలి. ఇది చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఆవిరి పట్టడం వల్ల కఫం కరిగిపోతుంది. తులసి, దాల్చినచెక్క, లవంగాలు బ్యాక్టీరియా వ్యాప్తిని నివారిస్తాయి. ఆవిరి పట్టడం వల్ల ముక్కు, గొంతు వాపు తగ్గుతుంది.

వర్షాకాలంలో జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లయితే.. లవంగం, అల్లం, తులసి ఆకుల కషాయాన్ని తాగడం మంచిది. దానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జలుబు రెండు మూడు రోజుల్లో నయమవుతుంది. కానీ దగ్గు ప్రారంభమైతే అది కనీసం ఒక వారం పాటు ఉంటుంది. ఈ దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది. పాలలో కూడా పసుపు మరిగించి తాగొచ్చు. దీని ద్వారా దగ్గు, జలుబు తగ్గుతాయి.

No comments:

Post a Comment