Thursday, August 1, 2024

 పొట్టకు సంబంధించి అన్ని సమస్యలకు ఒకటే మందు..!

తీసుకునే ఆహారం విషయంలో ఏమాత్రం తేడా జరిగినా అది కడుపు మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా వేళకాని వేళలో తినడం, అతిగా తినడం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం, రాంగ్ కాంబినేషన్ ఫుడ్ తీసుకోవడం, అనారోగ్యకరమైన పానీయాలు తాగడం వంటివి కడుపుకు సంబంధించిన సమస్యలను పెంచుతాయి. అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం,గ్యాస్, చెడు వాసనతో కూడిన అపానవాయువు, మలబద్దకం వంటివన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి. అయితే కడుపుకు సంబంధించిన ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టడానికి ఆయుర్వేదం సూచించిన ఒకే ఒక్క పొడిని రోజూ తీసుకుంటే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో త్రిఫలకు చాలా ప్రాధాన్యత ఉంది. త్రిఫల చూర్ణం అనేది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.. మూడింటి మిశ్రమం. ఇది జీర్ణసమస్యలను మంత్రించినట్టు నయం చేస్తుంది.

త్రిఫలను ఎలా వాడాలి..?
రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి దాని మీద మూత పెట్టాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దీన్ని వడగట్టి అందులో నిమ్మరసం కాస్త కలుపుకుని తాగాలి. కావాలి అనుకుంటే అందులో రెండు స్పూన్ల తేనె కూడా కలుపుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల పానీయాన్ని తాగుతుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. బరువు తగ్గడంలోనూ, ఆకలిని పెంచడంలోనూ సహాయపడుతుంది.

త్రిఫల ప్రయోజనాలు..
త్రిఫల చూర్ణం పైన చెప్పుకున్న విధంగా తీసుకుంటే కేవలం జీర్ణ సమస్యలు, మలబద్దకమే కాదు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి.
త్రిఫల చూర్ణంలో గుండెకు మేలు చేసే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ త్రిఫల పానీయం తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు త్రిఫల చూర్ణాన్ని నీటిలో కాకుండా పాలలో కలిపి తాగాలి. ఇది చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది. ఇదే కాకుండా త్రిఫల చూర్ణాన్ని వేడినీటిలో కలుపుకుని తాగినా తగిన ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment