Tuesday, September 17, 2024

 మొబైల్‌ ఫోన్లను పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా..? 


నేటికాలంలో రోజూ నిద్రపోయే ముందు ఫోన్‌ చూసి పడుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఫోన్‌ని పక్కనే పడుకుని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. మొబైల్‌ ఫోన్ల వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అదెలాగో తెలుసుకుందామా..?!

మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే లైటింగ్‌ మెదడును ఉత్తేజపరుస్తుంది. మొబైల్‌ ఫోన్లు పక్కనే ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. మొబైల్‌ ఫోన్‌ల నుంచి వచ్చే కాంతి మెదడులోని మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్‌ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

మొబైల్‌ ఫోన్‌ నుంచి వెలువడే కాంతిలో రేడియేషన్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. అలాగే మొబైల్‌ ఫోన్‌ లైటింగ్‌తో తలనొప్పి వచ్చే అవకాశాలెక్కువ ఉన్నాయి. ఈ కాంతి కంటి సమస్యలకు కూడా కారణమవుతోంది.

రాత్రి వేళల్లో మొబైల్‌ ఫోన్‌ మీ పక్కన లేకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు :

– మొబైల్‌ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పడకగదిలోకి తీసుకురావద్దు.

– నిద్రపోయే ముందు మొబైల్‌ ఫోన్‌ను ఫ్లయిట్‌ మోడ్‌లోకి సెట్‌ చేసుకోండి.

– నిద్రపోయే ముందు మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ లేదా నోటిఫికేషన్‌ టోన్‌లను బంద్‌ చేయండి.

– మీరు పడుకునే ప్రాంతంలో మొబైల్‌ ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టొద్దు. మీకు దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్‌ పెట్టండి. ఫోన్‌కి రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి అలానే వదిలేస్తే మొబైల్‌ బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.

 వీటిని తింటే సంతోషం మీ సొంతం..!

నేటి కాలంలో ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులే కాదు.. మిగతా ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా విపరీతమైన పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. పని ఒత్తిడి వల్ల సరైన సమయానికి కూడా తినలేకపోవడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామాలు చేసినా ఒత్తిడి తగ్గకపోతే.. మీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సంతోషం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

సాల్మన్‌ ఫిష్‌ : సాల్మన్‌, ట్యూనా వంటి ఫిష్‌లలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్‌ప్లమేషన్‌ను తగ్గించి, సంతోషాన్ని పెంచుతాయి.

ద్రాక్ష : నీటిశాతం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

అవకాడో : అవకాడోలో విటమిన్‌ బి6, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి.

బచ్చలికూర : బచ్చలికూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పెరుగు : పులియబెట్టిన ఆహారాలు తినడంతో ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇడ్లీ, దోస, పెరుగు తినడంతో ఒత్తిడి తగ్గుతుంది. ఆనందం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తినకూడదు.. ఎందుకంటే?


డ్రైఫ్రూట్స్‌ రుచిగా ఉండడమేకాదు… త్వరగా శక్తినిస్తాయి. అందుకే చాలామంది తమ ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటారు. అయితే ఐదు రకాల డ్రైఫ్రూట్స్‌ మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం డ్రైఫ్రూట్స్‌ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అత్తిపండ్లు

అత్తిపండ్లలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉన్న ఈ అత్తిపండ్లలో నేచురల్‌ షుగర్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి తీపిగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యంగా ఉంటుంది. ఉబ్బరంగా అనిపిస్తుంది. వీటిని ఉదయంపూట తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.


ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో సహజంగానే షుగర్స్‌ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ ముందు ఖాళీ కడుపుతో వీటిని తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది. అందుకే ఉదయాన్నే వీటిని తీసుకోకుండా ఉంటేనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వీటిని తినాలనుకుంటే.. రోజులో ఏదో ఒక టైమ్‌లో తీసుకోవచ్చు. వీటిని నేరుగా కాకుండా.. పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది.

ఆప్రికాట్స్‌

ఎండిన ఆప్రికాట్స్‌లో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా వీటిల్లోనూ నేచురల్‌ షుగర్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే కాకుండా.. ఈవినింగ్‌ స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిని చిరుధాన్యాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.


ప్రూనె

ఈ పండ్లలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే నేచురల్‌ షుగర్స్‌ వల్ల ఇవి తియ్యగానే ఉంటాయి. వీటిని తింటే.. షుగర్‌ స్థాయిలు పెరుగుతాయి. ప్రూనె పండ్లను కూడా మధుమేహవ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది.


కర్జూరం

కర్జూరంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రుచిగానూ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ కంటే ముందే తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. వీటిని తీసుకుంటే త్వరగా శక్తినిస్తాయి. కానీ ఊహించని విధంగా షుగర్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే కర్జూరం తీసుకోకుండా ఉంటేనే మంచిది.

  మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా?


మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా? అయితే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు రోజూ పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కచ్చితంగా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.

– నిద్ర సరిగ్గా లేకపోతే మధుమేహం, ఊబకాయ సమస్యలకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు.

– తగినంత నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

– నిద్ర లేకపోవడం వల్ల.. అధికంగా తింటారు. అందుకే ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే మీరు తగినంత ఆహారం తీసుకోవడంతోపాటు, కంటినిండా నిద్రపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం తప్పుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

 వేసవి తాపాన్ని తగ్గించే చియా సీడ్స్‌!


 నలుపు, తెలుపు రంగుల్లో మార్కెట్లో లభించే చియా సీడ్స్‌ వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు చియా సీడ్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడించాయి.

– చియా సీడ్స్‌ని నేరుగా తీసుకోకూడదు. వాటిని నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని పెరుగులోనూ, సలాడ్స్‌లోనూ వేసుకుని తీసుకోవచ్చు.

– నానబెట్టిన వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా పంచదార, గ్యాస్‌ వాటర్‌ని పోసుకుని తీసుకోవచ్చు.

– చియా సీడ్స్‌ వల్ల బరువు మాత్రమే కాదు. వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

– చియా సీడ్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి జీర్ణక్రియకు ఎంతో దోహదపడతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.

 నిద్రపోయే ముందు లెమన్‌ వాటర్‌ తాగితే బరువు తగ్గుతారా..?

అధిక బరువు ఉన్నవారు.. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది ఆహారం మానేస్తారు. మరికొంతమంది ఫ్రూట్స్‌, పానీయాల్ని తీసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. నిద్రపోయేముందు లెమన్‌ వాటర్‌ తాగితే సులువుగా బరువు తగ్గుతారు అని తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది.

ఒక గ్లాసు వేడి నీటిలో లెమన్‌ జ్యూస్‌, కొద్దిగా అల్లం రసం, రెండు మూడు లవంగాలు వేసుకుని నిద్రపోయే ముందు తాగితే బరువు తగ్గుతారు అని సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ అవుతుంది. అయితే ఈ నీటిని రోజూ తాగితే బరువు తగ్గుతారు అని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం, అల్లం రసం, లవంగాలు వంటి పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటితో చేసిన నీటిని తీసుకుంటే అధిక బరువు కాకపోయినా.. తక్కువ బరువు తగ్గవచ్చు. ఈ నీరు అందరికి సరిపడుతుందని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఈ నీటిని తీసుకుంటే కొందరికి వికారము, వాంతులు కూడా అవ్వొచ్చు. మీరు ఈ నీటిని ఒకసారి తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఈ నీటిని తీసుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవిలో ఉప్పు నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

వేసవిలో విపరీతమైన ఎండల వల్ల చెమటలు పట్టడం డీహైడ్రేషన్‌కి గురవ్వడం జరుగుతుంటుంది. రోజుకి ఎన్ని నీటిని తాగినా సరే నోరు ఎండిపోతుంది. చల్లని నీరు లేదా, కొబ్బరి నీళ్లు ఇలా రకరకాలుగా పానీయాలు తీసుకున్నా సరే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

– వేసవిలో విపరీతంగా చెమట పడుతుంది. దీంతో చెమట రూపంలో సోడియం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది. తద్వారా డీహైడ్రేషన్‌ నుంచి కూడా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

– ఉప్పు నీటిని అందరూ తీసుకోకూడదు. రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఉప్పునీటిని తీసుకోబోయే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

– మూత్రపిండాల పనితీరు సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా ఉప్పునీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు...